అక్షరాల ఆకాశంలో అహల ఉదయతార
చదువుకునే వయసులోనే
అక్షరాలతో సాహిత్య సామ్రాజ్యాన్ని నిర్మిస్తోంది
కుమారి లక్ష్మీ అహల.
ముంబాయి తెలుగు సమితి ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాల సదస్సులో
తన 9వ అష్టావధానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి,
పృచ్ఛకుల సవాళ్లకు పద్యంతో సమాధానమిస్తూ
తన అసాధారణ ధారణా ప్రతిభను చాటింది.
పదేళ్ల ప్రాయంలోనే
ఛందస్సును ఒడిసిపట్టి,
పద్యాన్ని పలికించి,
తెలుగు సాహిత్యాన్ని తన శ్వాసగా చేసుకున్న
అహల ప్రతిభ నిజంగా అభినందనీయం.
ఇది ఒక బాలిక సాధించిన విజయం మాత్రమే కాదు…
భావితరాల్లో తెలుగు సాహిత్యం ఇంకా సజీవంగా ఉందనే
ఒక అందమైన ఆశాకిరణం.
అవధానిని: కుమారి లక్ష్మీ అహల (10వ తరగతి)
సంచాలకులు: మహా సహస్రావధాని డాక్టర్ కడిమిళ్ళ వరప్రసాద్ గారు
ముఖ్య అతిథి: శ్రీ తటవర్తి శ్రీకల్యాణ్ గారు
ఈ సాహితీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన
అధ్యక్షులు డాక్టర్ కల్లూరి సుందర రామ మూర్తి గారు,
మాజీ అధ్యక్షులు శ్రీ ఆదుర్తి శ్రీనివాసరావు గారు,
కార్యదర్శి డాక్టరు శ్రీమతి శైలజ దేశాయ్ గారికి అభినందనలు.
కుమారి లక్ష్మీ అహలకు హృదయపూర్వక అభినందనలు.
నీ అక్షర ప్రయాణం
తెలుగు సాహిత్య చరిత్రలో
మరెన్నో అందమైన పుటలు రాయాలి! 🙏
గాలి మురళీధర్
ముంబాయి
What do you feel about this post?
Like
Love
Happy
Haha
Sad
